Revanth Reddy: నీ పేరు డైరీలో రాసాం.. బోధ‌న్ ఏసీపీకి వార్నింగ్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (revanth reddy) బోధ‌న్ ఏసీపీకి ప‌బ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌పై కాంగ్రెస్, BJP నేత‌లు దాడికి దిగ‌డంతో ఏసీపీ హ‌యాంలో పోలీసులు వారిపై లాఠీ చార్జి చేసారు. ఈ నేప‌థ్యంలో రేవంత్ ఏసీపీకి వార్నింగ్ ఇచ్చారు. త‌మ కార్య‌క‌ర్త‌లు రెడ్ డైరీలో పేరు రాసార‌ని ఇంకో ప‌దిహేను రోజుల్లో ఏం జ‌రుగుత‌దో ఏమో చెప్ప‌లేమ‌ని అన్నారు. పార్టీకి మాత్ర‌మే కాకుండా పార్టీల‌కు అతీతంగా ప‌నిచేస్తే ఉద్యోగాలు ఉంటాయ‌ని లేదంటే త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటామో త‌మ‌కే తెలీద‌ని రేవంత్ హెచ్చ‌రించారు.