Agra: అర్థరాత్రి మ‌హిళ ఏడుపు.. ప‌రిగెత్తుకొచ్చిన పోలీసులు

Agra: ఓ మ‌హిళ అర్థ‌రాత్రి హోట‌ల్ బ‌య‌ట కూర్చుని ఏడుస్తున్న‌ట్లు పోలీసుల‌కు తెలీడంతో హుటాహుటిన ఆమె వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఏం జ‌రిగింద‌ని ఆరా తీయ‌గా.. తాను ప‌నిచేస్తున్న చోట ఐదుగురు వ్య‌క్తులు అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఆమె చెప్ప‌డంతో పోలీసులు షాక‌య్యారు. వెంట‌నే నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘ‌ట‌న ఆగ్రాలో చోటుచేసుకుంది.

పోలీసులు ఆ హోట‌ల్‌లోని సీసీటీవీ ప‌రిశీలించ‌గా బాధిత మ‌హిళ కాళ్లు పట్టుకుని గ‌దిలోకి లాక్కెళుతున్న‌ట్లు క‌నిపించింది. మ‌హిళ‌ను మ‌రిన్ని వివ‌రాలు కోర‌గా త‌న‌కు న‌లుగురు కూతుళ్లు ఉన్నార‌ని ఈ హోట‌ల్లో ఏడాదిన్న‌ర నుంచి ప‌నిచేస్తున్నాన‌ని చెప్పింది. త‌నకు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తే మ‌రో న‌లుగురితో క‌లిసి దారుణంగా రేప్ చేసార‌ని అడ్డుకున్నందుకు గాజు సీసాతో త‌ల ప‌గ‌ల‌గొట్టార‌ని తెలిపింది. త‌న ఫోన్ లాక్కుని వీడియోలు తీసి బెదిరించార‌ని త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బును కూడా లాక్కున్నార‌ని పేర్కొంది. పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.