Ramoji Rao తుపాకీతో బెదిరించారు..AP CID కేసు న‌మోదు

రామోజీ సంస్థ‌ల అధినేత‌ రామోజీ రావు (ramoji rao), మార్గద‌ర్శి ఛైర్‌ప‌ర్స‌న్ శైల‌జా కిర‌ణ్‌ల‌పై (shailaja kiran) AP CID కేసు న‌మోదు చేసింది. మార్గ‌ద‌ర్శిలోని వాటాదారుల్లో ఒక‌రైన జ‌గ‌న్నాథ్ రెడ్డి అల్లు యూరిరెడ్డి రామోజీ, శైల‌జ‌ల‌పై కేసు పెట్టారు. రామోజీ త‌న‌ను తుపాకీతో బెదిరించి మ‌రీ కొన్ని షేర్ల‌ను శైల‌జ పేరుపై బ‌ల‌వంతంగా రాయించార‌ని ఆరోపించారు. రూ.1,59,69,600 షేర్ల‌ను రామోజీ కేవ‌లం రూ.39,74,000 ల‌కే త‌న చేత బ‌ల‌వంతంగా సంత‌కాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఐడి అధికారులు క్షేత్ర స్థాయిలో విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు.  (ramoji rao)