Bihar: ఘోర రైలు ప్రమాదం.. చెల్లాచెదురైన బోగీలు

బీహార్‌లో (bihar) ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. బక్సర్ సమీపంలో నిన్న రాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో బోగీలు చెల్లా చెదురయ్యాయి. మొత్తం 21 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు న‌లుగురు మృతిచెందగా ప‌లువురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి గౌహతిలోని కామాఖ్య జంక్షన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు రైల్వే శాఖ రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.