Rakhi రోజే చ‌నిపోయిన అన్న‌

క‌రీంన‌గ‌ర్ జిల్లా పెద్దపల్లి ఎలిగేడు మండలంలో దారుణం జ‌రిగింది. రాఖీ పండుగ (rakhi) రోజునే ఓ యువ‌కుడు గుండెపోటుతో మృతిచెందాడు. అన్న‌య్య‌కు రాఖీ కట్టాల‌ని వ‌చ్చిన ఆ చెల్లెలు.. త‌న అన్న‌య్య ఇక లేడ‌ని తెలుసుకుని కుప్ప‌కూలిపోయింది. ఎలిగేడు మండలానికి చెందిన చౌదరి కనకయ్య అప్పటిదాకా సంతోషంగా ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హాస్పిట‌ల్‌కు త‌ర‌లించగా అప్ప‌టికే గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. దాంతో అత‌ని మృతదేహాన్ని వెంట‌నే ఇంటికి తీసుకొచ్చారు. రాఖీ కట్టడానికి వచ్చిన ఆయన సోదరి గౌరమ్మ పుట్టెడు దుఖంతో కడసారిగా కనుకయ్య మృతదేహానికి రాఖీ కట్టి అన్నను సాగనంపింది. రాఖీ రోజునే అన్నాచెల్లెళ్ల‌ను కాలం ఇలా విడదీసింది అంటూ స్థానికులు క‌న్నీళ్లు పెట్టుకున్నారు.