Praggnanandha అందువ‌ల్లే ఓడిపోయాడు: ఆనంద్

భార‌త యువ చెస్ సంచ‌ల‌నం ప్రజ్ఞానంద (praggnanandha) చెస్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో (chess world cup) ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. చెస్‌లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న మార్న‌స్ కార్ల్‌సన్‌తో (marnus carlson) ఫైన‌ల్‌లో పాల్గొన్న ప్రజ్ఞానంద ఓడిపోయాడు. అయినా కోట్లాది మంది అభిమానుల‌ను గెలుచుకున్నాడు. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద రూ.90 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రైజ్ మ‌నీ గెలుచుకున్నాడు. అయితే ప్రజ్ఞానంద ఓడిపోవ‌డానికి కార‌ణాన్ని వివ‌రించాడు చెస్ లెజెండ్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్ (vishwanathan anand). ప్రజ్ఞానంద నీర‌సం వ‌ల్లే ఓడిపోయాడ‌ని తెలిపారు.

“” ప్రజ్ఞానంద ఎంతో అద్భుతంగా ఆడాడు. బాగా పోరాడాడు. టై బ్రేక్ అవ్వడం కూడా గొప్ప విష‌య‌మే. కానీ టోర్న‌మెంట్ ఫైన‌ల్స్‌లో ప్రజ్ఞానంద నీర‌సించిపోయాడు. అందుకే అత‌ను ఓడిపోయాడు. ఈ మ‌ధ్య‌కాలంలో ప్రజ్ఞానంద ఎన్నో గేమ్స్ ఆడాడు. అందుకే నీర‌సించిపోయిన‌ట్లు క‌నిపించాడు. బ‌హుశా అందుకే ఫోక‌స్ పెట్ట‌లేక ఓడిపోయాడు “” అని తెలిపారు ఆనంద్. (praggnanandha)