Allu Arvind: ఆయ‌న‌ జోలికొస్తే ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌ను

Hyderabad: మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) గురించి ఎవ‌రు త‌ప్పుగా మాట్లాడినా వ‌దిలిపెట్ట‌న‌ని వార్నింగ్ ఇచ్చారు నిర్మాత అల్లు అర‌వింద్ (allu arvind). నిన్న జ‌రిగిన భోళా శంక‌ర్ (bhola shankar) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వ‌చ్చిన అర‌వింద్.. 12 ఏళ్ల క్రితం వేసిన కేసు గురించి ప్ర‌స్తావించారు. చిరంజీవి అంటే త‌న‌కు ఎంత అభిమాన‌మో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని, 12 ఏళ్ల క్రితం ఆయ‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన‌వారిపై కేసు పెట్టి వారిని జైలుకు పంపించేదాకా వ‌ద‌ల్లేద‌ని అన్నారు. 12 ఏళ్ల క్రితం బ్ల‌డ్ బ్యాంక్ పేరుతో చిరంజీవి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ (jeevita rajasekhar) ఆరోప‌ణ‌లు చేసారు.

దాంతో అర‌వింద్ వారిపై ప‌రువు న‌ష్టం దావా వేసారు. 12 ఏళ్ల పాటు సాగుతూ వ‌చ్చిన ఈ కేసులో ఇటీవ‌ల కోర్టు తీర్పు వెల్ల‌డించింది. వారికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఆ త‌ర్వాత జీవిత‌, రాజ‌శేఖర్‌లు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ విష‌యం గురించే అల్లు అర‌వింద్ నిన్న ఈవెంట్‌లో మాట్లాడుతూ చిరు గురించి నెగిటివ్‌గా ఎవ‌రు మాట్లాడినా వ‌దిలిపెట్ట‌న‌ని హెచ్చ‌రించారు.