YS Sharmila: నాన్న క‌ల‌ను నేను నెర‌వేరుస్తా

Kadapa: నాన్న క‌న్న క‌ల‌ల‌ను నేను నెర‌వేరుస్తా అని అన్నారు దివంగ‌త నేత వెఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురు, YSR తెలంగాణ పార్టీ అధ్య‌క్ష‌రాలు వైఎస్ ష‌ర్మిళ‌ (ys sharmila). ఈరోజు వైఎస్సార్ 74వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద ష‌ర్మిళ నివాళులు అర్పించారు. త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, కొడుకు, కూతురితో క‌లిసి నివాళులు అర్పించారు. నాన్న ఈ లోకాన్ని వదిలివెళ్ళినా..ప్రతి పేదవాడి చిరునవ్వులోనూ నాన్న బ్రతికే ఉన్నారు. రైతులు, ఆడబిడ్డల అభ్యున్నతి కోసం నాన్న కన్న ప్రతి కల.. నేను నెరవేరుస్తా అని ష‌ర్మిళ (sharmila) ట్వీట్ చేసారు.