Jr NTR: శ్యాం ఎలా చ‌నిపోయాడో కూడా తెలీదు

Hyderabad: ఆత్మ‌హ‌త్య చేసుకున్న తూర్పు గోదావ‌రి జిల్లా యువ‌కుడు, Jr NTR ఫ్యాన్ అయిన శ్యాంకు (shyam) తార‌క్ సంతాపం తెలియ‌జేసారు. శ్యాం చనిపోవ‌డం బాధాక‌రం అని, ఎలాంటి ప‌రిస్థితుల్లో ఎలా చ‌నిపోయాడో కూడా తెలీక‌పోవ‌డం మ‌రింత బాధ క‌లిగిస్తోంద‌ని అన్నారు. అత‌ని ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, కుటుంబీకులకు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేసారు. ప్ర‌భుత్వ అధికారులు వెంటనే ఈ కేసుపై ఉన్న‌త స్థాయిలో విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఇదీ జ‌రిగింది..

తూర్పు గోదావ‌రి చింత‌లూరు ప్రాంతానికి చెందిన శ్యాం (shyam) అనే కుర్రాడి ఆత్మ‌హ‌త్య సంచ‌ల‌నంగా మారింది. ఇత‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు (jr ntr) వీరాభిమాని. ఏం జ‌రిగిందో ఏమో తెలీదు కానీ నిన్న శ్యాం ఉరేసుకున్నాడు. అయితే ఆయ‌న మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. శ్యాంను వైసీపీ కార్య‌క‌ర్త‌లే హ‌త్య చేసార‌ని అటు ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో (chandrababu naidu) పాటు NTR ఫ్యాన్స్ కూడా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ట్విట‌ర్‌లో శ్యాంకు న్యాయం జ‌ర‌గాల‌న్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. శ్యాం కేసులో లోతుగా విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

శ్యాం ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు అని అంటున్నారు కానీ అత‌ని మెడ‌పై ఉరేసుకున్న‌ట్లు మార్క్ ఏమీ లేదు. పైగా నాడిపై లోతుగా పొడిచిన‌ట్లు ఉంది. ముక్కులో నుంచి ర‌క్తం కారుతున్న‌ట్లు మృత‌దేహాన్ని చూస్తే అర్ధ‌మ‌వుతోంది. ఉరేసుకున్న‌ప్పుడు శ్యాం కాళ్లు నేల‌కు తాకుతున్నాయి. ఇవ‌న్నీ చూస్తుంటే అత‌న్నిపై క‌క్షగ‌ట్టి చంపేసిన‌ట్లు తెలుస్తోంది. శ్యాంకి ఒక చెల్లెలు ఉంది. ఆమె పెళ్లి ఘ‌నంగా చేయాల‌ని శ్యాం ఎప్ప‌టినుంచో అనుకుంటున్నాడ‌ట‌. ఇప్పుడు ఆ బాధ్య‌త‌ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెల్ఫేర్‌ సంఘం తీసుకుంది. తామే ద‌గ్గరుండి శ్యాం చెల్లెలి పెళ్లి చేస్తామ‌ని ప్ర‌కటించారు.