Karnataka: అనుమానంతో గొంతు కోసి.. ర‌క్తం తాగాడు..!

Bengaluru: భార్య‌తో అఫైర్ పెట్టుకున్నాడ‌న్న అనుమానంతో స్నేహితుడి గొంతు కోసి చంప‌డ‌మే కాకుండా ఆమె ర‌క్తం తాగి రాక్ష‌సుడిలా ప్ర‌వ‌ర్తించాడు ఓ వ్య‌క్తి. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో (karnataka) చోటుచేసుకుంది. చిక్క‌బ‌ళ్లాపూర్‌కు చెందిన విజ‌య్‌కి ఎప్ప‌టినుంచో త‌న భార్య‌పై అనుమానం ఉంది. ఆమె త‌న స్నేహితుడితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న‌ట్లు విజ‌య్ అనుమానించాడు. ఇదే విష‌యమై ఇద్ద‌రి మ‌ధ్య చాలా సార్లు గొడ‌వ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి విజ‌య్.. త‌న స్నేహితుడి గొంతు కోసి ర‌క్తం తాగాడు. ఈ ఘ‌ట‌న స‌మ‌యంలో విజ‌య్ ఫ్రెండ్ అక్క‌డే ఉన్నాడు. వ‌ద్దని చెప్ప‌కుండా ఈ ఘోరాన్ని ఆప‌కుండా విజ‌య్ ర‌క్తం తాగుతున్న దృశ్యాల‌ను వీడియో తీసాడు. ఈ వీడియో బ‌య‌టికి రావ‌డంతో పోలీసులు విజ‌య్‌ని అదుపులోకి తీసుకున్నారు.