Delhi Murder: న‌డిరోడ్డుపై ప్రేయ‌సిని 20 సార్లు పొడిచి..

Delhi: న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే ప్రేయ‌సిని 20 సార్లు క‌త్తితో పొడిచి చంపాడు ఓ యువ‌కుడు (delhi murder). ఈ ఘ‌ట‌న దేశ‌రాజ‌ధాని దిల్లీలో (delhi) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రోహిణి ప్రాంతానికి చెందిన సాక్షి, సాహిల్ ప్రేమించుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం జ‌రిగింది. దాంతో సాక్షిపై కోపం పెంచుకున్న సాహిల్ ఆమె చంపాల‌నుకున్నాడు. నిన్న రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో సాక్షి త‌న ఫ్రెండ్ కొడుకు బ‌ర్త్‌డే పార్టీకి అని వెళ్తుండ‌గా సాహిల్ కాపు కాసి న‌డిరోడ్డుపై క‌త్తితో పొడిచేసాడు. అంత‌టితో ఆగ‌కుండా అక్క‌డే ఉన్న బండ‌రాయి ప‌లుమార్లు దాడి చేసాడు. దాంతో సాక్షి అక్కడిక‌క్క‌డే చ‌నిపోయింది. అంద‌రూ చూస్తుండ‌గా ఈ దారుణం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ఒక్క‌రూ ఆప‌లేక‌పోయారు. ఈ ఘోరం సీటీటీవీలో రికార్డు కావ‌డంతో సంచ‌ల‌నంగా మారింది. ప‌రారీలో ఉన్న సాహిల్ కోసం వెతుకుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు.