భ‌ర్త‌ను చంపి.. బుక్ రాసి.. దొరికేసింది!

America: ఓ మ‌హిళ భ‌ర్త‌ను చంపడ‌మే(murder) కాక దాని గురించి బుక్(book) రాయ‌డంతో దొరికిపోయింది. ఈ ఘ‌ట‌న అమెరికాలో(america) చోటుచేసుకుంది. అమెరికాలోని స‌మిట్ కౌంటీకి చెందిన కౌరీ అనే 33 ఏళ్ల మ‌హిళ‌.. త‌న భ‌ర్త ఎరిక్‌ను చంపేసింది. ఈ ఘ‌ట‌న 2022లో చోటుచేసుకుంది. వీరికి ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. వీరి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలీదు కానీ.. కౌరీ త‌న భ‌ర్త‌ను చంపేసి.. అదే రాత్రి పోలీసుల‌కు ఫోన్ చేసింది. త‌న భ‌ర్త ఎంత లేపినా లేవ‌డంలేద‌ని కంగారుప‌డుతూ చెప్పింది. దాంతో వెంట‌నే పోలీసులు కౌరీ ఇంటికి చేరుకున్నారు.

ఆ రోజు రాత్రి త‌న భ‌ర్త‌కు వోడ్కా ఇచ్చాన‌ని, అది తాగాక అత‌ను స్పృహ‌త‌ప్పి ప‌డిపోయాడ‌ని తెలిపింది. అ త‌ర్వాత ఎంత లేపినా లేవ‌లేద‌ని అప్ప‌టికే చ‌నిపోయాడ‌ని తెలిపింది. దాంతో పోలీసులు అత‌ని మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టెంకు పంపించారు. కేసు విచార‌ణ‌లో ఉండ‌గా.. కౌరీ త‌న పిల్ల‌లు డాడీని మిస్ అవ్వ‌కూడ‌ద‌ని వారి కోసం ఆర్ యూ విత్ మీ పేరుతో ఓ పుస్త‌కం రాసి ప‌బ్లిష్ చేసింది. తండ్రిని కోల్పోయిన పిల్ల‌లు అంద‌రికీ ఈ బుక్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని త‌న‌ని తాను మంచిదానిని అని చెప్పుకుంటూ ప్ర‌చారం చేసుకుంది. బుక్ గురించి కొన్ని ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చింది. కానీ భ‌ర్త‌ను చంపింది కౌరీనే అని తెలిసి అంతా షాక‌య్యారు. త‌న భ‌ర్త‌కు తెలీకుండా పెయిన్ కిల్ల‌ర్ అని చెప్పి డ్ర‌గ్స్ ఇచ్చేద‌ని, అది ఎక్కువ అవ‌డంతో ఎరిక్ చ‌నిపోయాడ‌ని పోలీసులు నిర్ధారించారు. వెంట‌నే కౌరీని అరెస్ట్ చేసారు.