Nalgonda: కాంగ్రెస్ నేత కుమారుడి దారుణం..!

Nalgonda: న‌ల్గొండ‌లో దారుణం చోటుచేసుకుంది. క‌ట్టుకున్న భార్య‌ను దారుణంగా కొట్టి చంపేసాడు ఓ వ్య‌క్తి. నిందితుడు కాంగ్రెస్ నేత రంగ‌సాయి రెడ్డి కుమారుడు వ‌ల్ల‌భ్ రెడ్డిగా (vallabh reddy) పోలీసులు గుర్తించారు. వ‌ల్ల‌భ్ రెడ్డి.. అత‌ని భార్య ల‌హ‌రి రెడ్డి (27) (lahari reddy) హిమాయత్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. (nalgonda)

వీరి పెళ్లి జరిగి ఏడాది కాగా ఈ నెల 13న రాత్రి వ‌ల్ల‌భ్‌కు ల‌హ‌రికి గొడ‌వ జ‌రిగింది. దాంతో వ‌ల్ల‌భ్ లహరిని తీవ్రంగా కొట్టాడు. లహరి తలను గోడకు, తలుపుకు బాది క‌డుపులో బ‌లంగా త‌న్న‌డంతో ఇంట‌ర్న‌ల్ బ్లీడింగ్ అయ్యి ల‌హ‌రి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. ఎవరికీ అనుమానం రాకుండా హార్ట్ ఎటాక్ పేరుతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసారు. గుండె పోటుతో చనిపోయినట్లుగా అందరిని నమ్మించారు.

24న భార్య దినకర్మకు 10వేల మందికి భోజనాలు పెట్టి ఏమీ తెలియనట్లు న‌టించాడు వ‌ల్ల‌భ్. పోస్టుమార్టం రిపోర్టులో ల‌హ‌రి హార్ట్ ఎటాక్ వ‌ల్ల కాకుండా త‌ల‌కు, క‌డుపులో తీవ్రంగా త‌గిలిన దెబ్బ వ‌ల్ల చనిపోయిన‌ట్లు తేలింది. లహరి తలపై గాయాలు ఉన్నట్లు కనిపిస్తున్నా ఆమె త‌ల్లిదండ్రులు అనుమానం వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. లహరి తల్లితండ్రులను వల్లభ్ బెదిరించినట్లు తెలుస్తోంది. వల్లభ్‌ నిందుతుడుగా తేలడంతో అతనిపై సెక్షన్ 302 మర్డర్, 201 సాక్షాల తారుమారు కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.