Moinabad: దారుణం.. మ‌హిళ‌ను కాల్చి చంపేసిన దుండగులు

Moinabad: మొయినాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కొంద‌రు వ్య‌క్తులు ఓ యువ‌తికి నిప్పు పెట్టి కాల్చి చంపేసారు. పూర్తిగా కాలిపోయిన శ‌వాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే శ‌రీరం పూర్తిగా కాలిపోవ‌డంతో యువ‌తి వివ‌రాలు ఏవీ తెలీలేద‌ని పోలీసులు అంటున్నారు. మొయినాబాద్ పరిస‌ర ప్రాంతాల్లో మిస్సింగ్ కంప్లైంట్ల ఆధారంగా ఆమె వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ఉన్నారు.