కూతుర్ని చంప‌మ‌న్న తల్లి.. త‌ల్లిని ఏసేసిన కిల్ల‌ర్

woman hires hit man and gets killed

Murder: ఓ త‌ల్లి త‌న మాట విన‌డంలేద‌ని వ‌య‌సొచ్చిన కూతురిని చంపాల‌నుకుంది. ఇందుకోసం ఓ వ్య‌క్తికి సుపారీ కూడా ఇచ్చింది. కానీ ఆ వ్య‌క్తి ఏకంగా ఆమెనే చంపేసాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. ఈటా ప్రాంతానికి చెందిన అల్కా అనే మ‌హిళ త‌న కూతురితో విసిగిపోయింది. ఓ అబ్బాయితో ప్రేమ‌లో ఉన్న అల్కా కూతురు త‌న మాట విన‌డంలేద‌న్న కోపంతో ఎలాగైనా వ‌దిలించేసుకోవాల‌నుకుంది. ఇందుకోసం గ‌త నెల‌లో సుభాష్‌ అనే వ్య‌క్తికి రూ.50000 సుపారీ ఇచ్చి త‌న కూతురిని చంపాల‌ని చెప్పింది. ఇందుకు అత‌ను కూడా ఒప్పుకున్నాడు. కానీ ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. కూతురిని చంప‌మ‌ని సుమారీ ఇస్తే ఆ సుభాష్‌ అనే వ్య‌క్తి సుపారీ ఇచ్చిన త‌ల్లినే ఏసేసాడు.

పొలంలో అల్కా మృత‌దేహం పోలీసుల‌కు ల‌భించ‌డంతో వారు వెంట‌నే విచార‌ణ చేప‌ట్ట‌గా షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అల్కా ఎవ‌రినైతే త‌న కూతురిని చంపాల‌ని పుర‌మాయించిందో ఆ వ్యక్తి ఎవ‌రో కాదు త‌న కూతురిని ప్రేమించిన వాడే. దాంతో ఈ ప్లాన్ గురించి నితిన్ త‌న ప్రేయ‌సికి చెప్ప‌డంతో చంపేస్తేనే పెళ్లి చేసుకుంటాన‌ని బెదిరించింది. దాంతో గ‌త్యంత‌రం లేక సుభాష్ అల్కాను చంపేసాడు. దాంతో నిన్న రాత్రి పోలీసులు సుభాష్‌తో పాటు అల్కా కూతురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.