క‌నుబొమలు చేయించుకున్న మ‌హిళ‌.. విడాకులు ఇచ్చిన భ‌ర్త‌

ఓ ముస్లిం మ‌హిళ క‌నుబొమ‌లు (eyebrows) చేయించుకోవ‌డంతో అది చూసిన ఆమె భ‌ర్త ఫోన్ ద్వారానే ట్రిపుల్ త‌లాక్ (triple talaq) ఇచ్చేసాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో (uttar pradesh) చోటుచేసుకుంది. కాన్పూర్‌కి చెందిన గుల్సాబా అనే మ‌హిళ త‌న అత్త‌గారి ఇంట్లో ఉంటోంది. ఆమె భ‌ర్త సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో మొన్న సాయంత్రం పార్ల‌ర్‌కు వెళ్లి క‌నుబొమ‌లు చేయించుకుంది. ఆ త‌ర్వాత త‌న భ‌ర్త‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడింది. ఆ స‌మ‌యంలో కొనుబొమ‌లు చూసిన ఆమె భ‌ర్త త‌న అనుమ‌తి తీసుకోకుండా చేయించుకుంద‌న్న ఆగ్ర‌హంతో అక్క‌డిక‌క్క‌డే ట్రిపుల్ త‌లాక్ చెప్పేసాడు. దాంతో బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న అత్తింటివారు క‌ట్నం కోసం కొంత‌కాలంగా వేధిస్తున్నార‌ని తెలిపింది. ముస్లిం వివాహ చ‌ట్టం కింద బాధితురాలి భ‌ర్త‌, అత్తింటివారిపై పోలీసులు కేసు న‌మోదు చేసారు.