Viral News: ఎఫైర్ ద్వారా గ‌ర్భం.. అబార్ష‌న్ విక‌టించి మృతి.. శ‌వాన్ని వ‌దిలించుకున్న ప్రియుడు

woman dies while aborting child

Viral News: ఓ వివాహిత అక్ర‌మ సంబంధం ద్వారా గ‌ర్భం దాల్చ‌డంతో ఆ బిడ్డ‌ను వ‌దిలించుకోవాల‌నుకుంది. ఆ క్రమంలో ఆమె చ‌నిపోవ‌డంతో ప్రియుడు శ‌వాన్ని న‌దిలో ప‌డేసాడు. ఈ ఘ‌ట‌న పుణెలో చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువ‌తి ఆల్రెడీ ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకుని అతనితో ఇద్ద‌రు పిల్ల‌ల్ని కనింది. కొన్ని కార‌ణాల వ‌ల్ల భ‌ర్త‌తో విడిపోయిన ఆమె గ‌జేంద్ర అనే వ్య‌క్తితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ క్ర‌మంలో ఆమె గ‌ర్భం దాల్చింది. అయితే పెళ్లికి ముందే గ‌ర్భం వ‌ద్ద‌ని గ‌జేంద్ర అబార్ష‌న్ చేయించుకోవాల‌ని ఆదేశించాడు.

ఇందుకోసం థానేలోని ఓ హాస్పిట‌ల్‌కు పంపాడు. అయితే అబార్ష‌న్ విక‌టించి ఆమె చ‌నిపోయింది. విష‌యం గజేంద్ర‌కు తెలీడంతో త‌న స్నేహితుడి సాయంతో ఆ యువ‌తి మృత‌దేహాన్ని స్థానిక ఇంద్ర‌యాని న‌దిలో ప‌డేసాడు. ఆ స‌మ‌యంలో త‌న‌తో పాటు ఉన్న ఆ యువ‌తి ఇద్ద‌రు పిల్ల‌లు త‌ల్లి కోసం ఏడుస్తుంటే ఎవ‌రికైనా అనుమానం వ‌స్తుందేమో అని వారిని కూడా న‌దిలో ప‌డేసాడు. కొంత‌కాలంగా త‌న కూతురు క‌నిపించ‌డంలేద‌ని యువ‌తి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో గ‌జేంద్ర చేసిన ఘోరం బ‌య‌ట‌ప‌డింది. ఇంద్ర‌యాని న‌ది నుంచి యువ‌తితో పాటు ఇద్ద‌రు పిల్ల‌ల మృత‌దేహాల‌ను బ‌య‌టికి తీసారు. గ‌జేంద్ర‌తో పాటు అత‌నికి సాయం చేసిన స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.