Viral News: దారిత‌ప్పిన వివాహిత‌.. ప్రియుడి పాలిట మృత్యువు

woman beats husband to death with a bat

Viral News: ఆల్రెడీ వివాహ‌మై మ‌రో వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తోంద‌ని తెలిసి భ‌ర్త నిల‌దీసాడు. నువ్వు చేస్తోంది త‌ప్పు అని న‌చ్చజెప్ప‌గా.. అత‌న్ని బ్యాటుతో కొట్టి చంపేసింది. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. ఆగ్రాలోని మ‌ల‌పుర ప్రాంతానికి చెందిన క‌విత‌కు ఆల్రెడీ మ‌రో వ్య‌క్తితో వివాహం అయ్యింది. వివాహం అయినా కూడా త‌న అత్త‌గారింటి ద‌గ్గ‌ర్లో ఉండే బ్ర‌జ్‌వీర్ అనే యువ‌కుడితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ఆ త‌ర్వాత భ‌ర్త‌ను వ‌దిలేసి బ్ర‌జ్‌వీర్‌తో స‌హ‌జీవ‌నం చేసింది.

ఆ త‌ర్వాత క‌విత మ‌రో ప్రాంతానికి వెళ్లిపోయి అక్క‌డ సురేంద్ర అనే మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉండేది. ఈ విష‌యం తెలుసుకున్న బ్ర‌జ్‌వీర్ క‌విత‌ను ఏంటిది అని నిల‌దీసాడు. సురేంద్ర‌పై కోపంతో కొన్నేళ్ల క్రితం అత‌ని షాపుకు నిప్పు పెట్టించాడు. దాంతో క‌విత పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అలా బ్ర‌జ్‌వీర్ కొంత‌కాలం పాటు జైల్లో ఉండి ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌ల అయ్యాడు. జైలు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాక వెంట‌నే క‌విత వ‌ద్ద‌కు వెళ్లి బెదిరించాడు. దాంతో క‌విత మ‌రో న‌లుగురు యువ‌కుల‌తో క‌లిసి బ్ర‌జ్‌వీర్‌ను హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. మాట్లాడాలి అని పిలిచింది.

బ్ర‌జ్‌వీర్ ఆమె మాట‌లు న‌మ్మి ఒంట‌రిగా వెళ్లాడు. ఆ స‌మ‌యంలో క‌విత త‌న ప్రియుడు సురేంద్ర‌తో అత‌ని స్నేహితుల‌తో క‌లిసి బ్రజ్‌వీర్‌ను బేస్‌బాల్ బ్యాటుతో త‌ల‌పై కొట్టి హ‌త్య చేయించింది. అత‌ను చ‌నిపోయాక అక్క‌డే ఉన్న రోహ్తా కాలువ‌లో ప‌డేసి పారిపోయారు. క‌విత‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడ‌ని బ్ర‌జ్‌వీర్ త‌ల్లిదండ్రులు కూడా అత‌న్ని వ‌దిలించుకున్నారు. బిడ్డ చ‌నిపోయాడ‌ని తెలిసినా అత‌ని శ‌వాన్ని క‌లెక్ట్ చేసుకునేందుకు వారు నిరాక‌రించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు క‌విత‌తో పాటు మ‌రో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.