Viral News: అడ్డంగా దొరికిపోయి.. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపేసి..

wife kills husband after getting caught with paramour

Viral News: భ‌ర్త ఉండ‌గా మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకోవ‌డ‌మే కాకుండా.. అడ్డంగా దొరికిపోయి ఏకంగా భ‌ర్త‌నే చంపేసింది ఓ మ‌హిళ‌. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని వైట్‌ఫీల్డ్‌లో చోటుచేసుకుంది. హ‌గ‌డూర్ ప్రాంతానికి చెందిన మ‌హేష్ అనే వ్య‌క్తి ఆటో డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌ని భార్య తేజ‌శ్విని.. ఇందిరా న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన గ‌జేంద్ర బాబు అనే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది.

నిన్న మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల స‌మ‌యంలో మ‌హేష్ ఇంటికి వెళ్ల‌గా.. అక్క‌డ భార్య తేజ‌శ్విని త‌న ప్రియుడు గ‌జేంద్ర‌తో అడ్డంగా దొరికిపోయింది. దాంతో మ‌హేష్ నానా ర‌చ్చ చేసాడు. అత‌ని నోరు మూయించేందుకు ఇద్ద‌రూ క‌లిసి యూఎస్‌బి కేబుల్‌తో గొంతు నులిమారు. అత‌ను స్పృహ కోల్పోయాక హాస్పిటల్‌కు త‌ర‌లించారు. అప్ప‌టికే మ‌హేష్ చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు.

ఆ త‌ర్వాత వైద్యులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వడంతో వారు తేజశ్వినిని అద‌పులోకి తీసుకుని విచారించారు. మ‌హేష్ ప్ర‌తి చిన్న విష‌యాల‌కు త‌న‌తో గొడ‌వ‌ప‌డుతుంటాడ‌ని.. ఈ నేప‌థ్యంలో త‌న‌పై దాడి చేయ‌బోతుంటే తోసేసాన‌ని.. అలా అత‌ను కింద‌ప‌డి చ‌నిపోయాడ‌ని చెప్పింది. కానీ మ‌హేష్ మృతదేహంపై మెడ భాగంలో ఉరి వేసిన‌ట్లు క‌నిపించ‌డంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేప‌ట్ట‌గా తేజ‌శ్విని, గ‌జేంద్ర‌లు త‌మ త‌ప్పును ఒప్పుకున్నారు.