అత్త‌గారికి రూ.200 ఇచ్చిన భ‌ర్త‌.. భార్య‌, పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌

Uttar Pradesh: ఓ వ్య‌క్తి త‌న త‌ల్లికి రూ.200 ఇచ్చాడ‌న్న కోపంతో అత‌ని భార్య‌, పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. ఉచాహ‌ర్ ప్రాంతానికి చెందిన సియావ‌తి.. త‌న త‌ల్లికి బాలేద‌ని ఊరికి వెళ్లొస్తాన‌ని కుమారుడు సంబిత్‌కు చెప్పింది. అందుకోసం సంబిత్ రూ.200 ఇచ్చాడు. అది సంబిత్ భార్య‌కు నచ్చ‌లేదు. ఎంత చెప్పినా విన‌కుండా డ‌బ్బు ఇచ్చాడ‌న్న కోపంతో ఆమె ఇద్ద‌రు పిల్ల‌ల‌ను స్థానిక బావిలోకి తోసేసి తాను కూడా దూకేసింది. స్థానికులు చూసి కాపాడేలోగా వారు ముగ్గురూ విగ‌త‌జీవులుగా మారారు.