Organ Transplant: భ‌ర్త బంధువుకు అవ‌య‌వ‌దానం చేసి చ‌నిపోయిన ఇల్లాలు

wife dies after giving liver to husband

Organ Transplant: భ‌ర్త‌ బంధువుకు అవ‌య‌వ‌దానం చేసి ఓ ఇల్లాలు త‌నువు చాలించిన హృద‌య‌విదార‌క ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటుచేసుకుంది.  అర్చ‌న అనే 33 ఏళ్ల మ‌హిళ టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది. కొంత‌కాలంగా కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆమె భ‌ర్త‌ బంధువు ఒక‌రికి అవ‌య‌వ మార్పిడి చేయాల‌ని వైద్యులు సూచించారు. కానీ స‌రైన డోన‌ర్ ఎంత ప్ర‌య‌త్నించినా దొర‌క‌లేదు.

దాంతో తానే అవ‌య‌వ‌దాత‌గా మారాల‌ని అర్చ‌న నిర్ణ‌యించుకుంది. ఇద్ద‌రి బ్ల‌డ్ గ్రూప్ ఒకటే కావ‌డంతో వైద్యులు ఆమె నుంచి కొంత కాలేయాన్ని తీసి ఆ మ‌హిళ‌కు అమ‌ర్చారు. స‌ర్జ‌రీ స‌క్సెస్ అయ్యింది. అర్చ‌న కూడా కోలుకుంది. డిశ్చార్జి అయిన నాలుగు రోజుల త‌ర్వాత అర్చ‌న‌కు తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. దాంతో ఆమెను వెంట‌నే అదే బెంగ‌ళూరులోని ఓ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అక్క‌డ చికిత్స పొందుతూ చ‌నిపోయింది. అర్చ‌న అవ‌య‌వ దానం చేసిన మ‌హిళ మాత్రం సంపూర్ణంగా కోలుకుంది.  అర్చ‌న‌కు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. త‌న బంధువును బ‌తికించ‌డం కోసం త‌న ప్రాణాల‌నే ప‌ణంగా పెట్టింది అంటూ ఆమె భ‌ర్త క‌న్నీరుమున్నీర‌య్యాడు.