Adilabad: భార్య ఆత్మహత్య.. ఆమె స‌మాధి వ‌ద్దే భర్త బలవన్మరణం

Adilabad: భార్య ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఆ భ‌యంతో భ‌ర్త కూడా సూసైడ్ చేసుకున్న ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గుడిహత్నుర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన‌ పల్లవి(22) ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియల అనంతరం తనపై ఈ అపవాద వస్తుందని ఆమె సమాధి వద్దకు వెళ్లిన‌ భర్త విజయ్(24) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.