Dawood Ibrahim ఆస్తుల‌ను మాత్ర‌మే కొనుగోలు చేస్తున్న లాయ‌ర్.. ఎందుకు?

Dawood Ibrahim: ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంకు సంబంధించిన ఆస్తుల‌ను కొనుగోలు చేయాలంటే ఎవ్వ‌రికీ ధైర్యం ఉండ‌దు. అస‌లు ఎవ్వ‌రూ కూడా ఆయ‌న ఆస్తులు వేలానికి పెడితే బిడ్డింగ్‌లో పాల్గొనే ధైర్యం చేయ‌రు. అలాంటిది ఒక లాయ‌ర్ మాత్రం కేవ‌లం దావూద్‌కు సంబంధించిన ఆస్తుల‌ను మాత్ర‌మే కోట్ల రూపాయ‌లు ఇచ్చి మ‌రీ సొంతం చేసుకుంటున్నారు.

ఢిల్లీకి చెందిన సీనియ‌ర్ లాయ‌ర్ అజ‌య్ శ్రీవాస్త‌వ దావూద్‌కు సంబంధించిన ఆస్తుల‌ను ఎక్క‌డ వేలానికి పెట్టినా వెంట‌నే అక్క‌డికి వెళ్లిపోతాడు. ఇత‌రుల‌కు పాట పాడే అవ‌కాశం కూడా ఇవ్వ‌రు. దావూద్ ఆస్తులకు అస‌లు విలువ లేదు. కాక‌పోతే అలా వ‌దిలేయ‌కుండా ఎవ‌రైనా కొనుగోలు చేయ‌క‌పోరా అని ప్ర‌భుత్వం దావూద్ ఆస్తుల‌ను వేలానికి పెడుతోంది.

ముంబైలోని నాగ‌పాడాలో దావూద్‌కి సంబంధించి కొంత భాగం భూమి అమ్మకానికి ఉంది. దాని విలువ రూ.15000 నుంచి ఉంది. అయితే వేలం పాట‌లో ఎవ్వ‌రికీ అవ‌కాశం ఇవ్వ‌కుండా అజ‌య్ ఏకంగా రూ.2 కోట్లు ఇచ్చి మ‌రీ ఆ భూమిని సొంతం చేసుకున్నారు. ఇదే కాదు.. గ‌తంలో రెండు ప్రాప‌ర్టీల‌ను కూడా అజ‌య్ శ్రీవాస్త‌వే ద‌క్కించుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు స‌ర్ అని అడిగితే.. దావూద్‌ను ఓడించాల‌ని ఉంద‌ని అందుకే అత‌ని ఆస్తుల‌న్నీ కొనేస్తున్నాన‌ని తెలిపారు.

అయితే దావూద్ ప్రాప‌ర్టీల‌ను కొనుగోలు చేసినందుకు గానూ చాలా మంది నుంచి బెదిరింపులు వ‌చ్చాయ‌ట‌. దాంతో దాదాపు 11 ఏళ్ల నుంచి అజ‌య్‌కు ముంబై ప్ర‌భుత్వం Z+ సెక్యూరిటీ అందిస్తోంది.