Amarnath Murder: ఆనాడు ర‌చ్చ చేసిన సెల‌బ్రిటీలు ఎక్క‌డ‌?

AP: బాప‌ట్ల జిల్లాకు చెందిన అమ‌ర్నాథ్ (amarnath murder) అనే యువ‌కుడిని కొన్ని రోజుల క్రితం పెట్రోల్ పోసి దారుణంగా చంపేసిన సంగ‌తి తెలిసిందే. త‌న అక్క‌ను ఏడిపిస్తున్నార‌ని ఎదురుతిరిగినందుకు అమ‌ర్నాథ్‌ను చంపేసారు. అయితే హంత‌కులు అధికార YCPకి చెందిన‌వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అమ‌ర్నాథ్ హ‌త్య గురించి ఇప్ప‌టివ‌ర‌కే ఏ ఒక్క సెల‌బ్రిటీ కానీ న్యాయం జ‌ర‌గాలంటూ ఒక్కమాటైనా మాట్లాడ‌కుండా మౌనం వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొన్నేళ్ల క్రితం తెలంగాణ‌లో (telangana) ఓ ఆడ‌పిల్ల‌ను (disha) దారుణంగా రేప్ చేసి పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టిన‌ప్పుడు సెల‌బ్రిటీలు మీడియా ముందుకు వ‌చ్చి తెగ ర‌చ్చ చేసారు. నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసినందుకు అప్ప‌టి సీపీ స‌జ్జ‌నార్‌ను తెగ పొగిడేసారు. మ‌రి ఇప్పుడు చిన్న పిల్లాడైన అమర్నాథ్‌ను దారుణంగా చంపితే ఒక్క‌రు కూడా మాట్లాడ‌టంలేదు. దీనిపై ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ (harish shankar) ఒక్క‌రే స్పందించారు. ఈ వార్త త‌న‌కు ఆల‌స్యంగా తెలిసింద‌ని, త్వ‌ర‌లో నిందితుల‌ను అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని అన్నారు.