G20 Summit: భార‌త్ ప‌రువు “నీళ్ల‌”పాలు

ప్ర‌పంచం ముందు భార‌త్ ప‌రువు నీళ్ల‌పాలైంది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జ‌రుగుతున్న జీ20 స‌మ్మిట్‌లో (g20 summit) భాగంగా రాజ‌ఘాట్ రోడ్డు వ‌ద్ద ఉన్న భార‌త్ మండ‌పం (bharat mandapam) ముందు భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది. నిన్న రాత్రి ప‌డిన వ‌ర్షం కార‌ణంగా నీరు ఇలా నిలిచిపోయింది. స‌మ్మిట్ కోస‌మ‌ని ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్న ప్ర‌భుత్వం ఈ విష‌యంలో మాత్రం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోన‌ట్లే తెలుస్తోంది.