Assam Gang Rape Case: రేప్ గురించి అడిగి.. రెండు రోజుల త‌ర్వాత గ్యాంగ్ రేప్‌కు గురై..

victim asked about rape just 2 days before she got gang raped

Assam Gang Rape Case: ఓ ప‌క్క క‌ల‌క‌త్తా అత్యాచార ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగానే కాకుండా అంత‌ర్జాతీయ మీడియాల్లోనూ కోడై కూస్తున్న‌ నేప‌థ్యంలో మ‌రోప‌క్క ఎప్ప‌టిక‌ప్పుడు ఆడ‌పిల్ల‌ల‌పై అత్యాచార ఘ‌ట‌న‌లు సర్వ‌సాధార‌ణంగా జ‌రుగుతూనే ఉన్నాయి. క‌ల‌క‌త్తా ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఓ మైన‌ర్ బాలిక అస‌లు రేప్ అంటే ఏంటో తెలుసుకోవాల‌ని అనుకుంది. దీని గురించి త‌న మేన‌త్త‌ను అడిగి తెలుసుకుంది. కానీ పాపం ఆ బాలిక‌కు ఏం తెలుసు.. ఈ దారుణ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న రెండు రోజుల్లోనే త‌న జీవితం నాశ‌న‌మైపోతుంద‌ని. ఈ ఘ‌ట‌న అస్సాంలో చోటుచేసుకుంది.

నాగావ్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక ట్యూష‌న్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండ‌గా ముగ్గురు యువ‌కుల చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఆమె అర్థ‌న‌గ్నంగా రోడ్డు ప‌క్క‌న అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉండ‌టాన్ని చూసి స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ప్ర‌స్తుతం బాలిక కోలుకుంటోంది. ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారిలో ఒక నిందితుడిని పోలీసులు క్రైం జ‌రిగిన స్థ‌లానికి తీసుకెళ్తుండ‌గా త‌ప్పించుకుని ప‌క్క‌నే ఉన్న చెరువులో దూకేసాడు. పోలీసులు వెళ్లిపోయాక త‌ప్పించుకుందాం అనుకున్నాడు కానీ వాడు చేసిన పాపం ఊరికే పోతుందా? ఊపిరాడ‌క చెరువులోనే చ‌నిపోయాడు. అత్యాచారం చేసిన నిందితుల్లో చెరువులో దూకి చ‌నిపోయిన‌వాడు ముస్లిం కావ‌డంతో అస్సాం నుంచి మియా (ముస్లింలు)లు వెళ్లిపోవాలంటూ స్థానికంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి.

బాలిక‌కు త‌ల్లి లేద‌ని.. తండ్రి ఉన్నా ఆర్థికంగా సాయం చేయ‌లేక‌పోతుండడంతో పాప‌ను త‌న వ‌ద్దే పెట్టుకుని చ‌దివించుకుంటున్నానని బాలిక మేన‌త్త పోలీసుల‌కు తెలిపారు. విచార‌ణ‌లో బాలిక రేప్ గురించి త‌న‌ను అడిగి తెలుసుకుందని.. తీరా త‌నే అత్యాచారానికి గుర‌వుతుంద‌ని అనుకోలేద‌ని ఆవిడ బోరున విల‌పించారు. త‌న‌కు పోలీస్ అధికారిణి అవ్వాల‌ని కోరిక‌ని.. పూర్తిగా కోలుకున్నాక బాగా చ‌దివి త‌ప్ప‌కుండా పోలీస్ అవుతాన‌ని చెప్పింద‌ని అన్నారు.