అందంగా లేడ‌ని భ‌ర్తకు నిప్పు అంటించి.. ఎంత దారుణం

Uttar Pradesh: భ‌ర్త అందంగా లేడ‌ని నిప్పు అంటించి మ‌రీ చంపేసింది ఓ కిరాత‌క మ‌హిళ‌. ఈ దారుణ ఘ‌ట‌న నేరాల‌కు అడ్డా అయిన ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సంభాల్ జిల్లాకు చెందిన ప్రేమ్‌శ్రీ అనే యువ‌తి.. 2017లో కుర్హ్ ఫ‌తేగ‌డ్ ప్రాంతానికి చెందిన స‌త్య‌వీర్‌ను వివాహం చేసుకుంది. వీరిది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. అయితే స‌త్య‌వీర్ న‌ల్ల‌గా ఉన్నాడ‌ని అత‌నితో పెళ్లి వ‌ద్ద‌న్నా కూడా పెద్ద‌వాళ్లు బ‌లవంతంగా చేసారు. ఆ త‌ర్వాత వీరికి ఓ పాప‌ కూడా పుట్టింది. అయితే పెళ్లి అయినప్ప‌టి నుంచి త‌న‌కు విడాకులు కావాల‌ని ప్రేమ్‌శ్రీ బ‌ల‌వంతం చేస్తూనే ఉంది.

అయినా స‌త్య‌వీర్ ఒప్పుకోక‌పోవ‌డంతో అత‌న్ని చంపేయాల‌ని నిర్ణ‌యించుకుంది. 2019లో త‌న భ‌ర్త నిద్రిస్తున్న స‌మ‌యంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. చుట్ట‌ప‌క్క‌ల వారు వెంట‌నే అత‌న్ని హాస్పిట‌ల్‌కు తర‌లించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న స‌త్య‌వీర్ పోలీసుల‌కు జ‌రిగినదంతా చెప్పి క‌న్నుమూసాడు. అయితే పోలీసులు 2021లో ఆమెపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసారు. ప్రేమ్‌శ్రీని కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా.. త‌న భ‌ర్త‌కు ప్ర‌మాద‌వ‌శాత్తు నిప్పు అంటుకుంద‌ని త‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేసాన‌ని బుకాయించింది. ప్రేమ్‌శ్రీ అబ‌ద్ధాలు ఆడుతోంద‌ని దాదాపు 10 మంది సాక్ష్యం చెప్ప‌డానికి ముందుకు రావ‌డంతో కోర్టు ఈరోజు తుది తీర్పు వెల్ల‌డించింది. నిందితురాలికి నాలుగేళ్లు క‌ఠిన కారాగార శిక్ష విధించింది.