Uttar Pradesh: కీచ‌క ప్ర‌న్సిప‌ల్.. సీఎంకు ర‌క్తంతో లేఖ రాసిన స్టూడెంట్స్

ఓ కీచ‌క ప్రిన్సిప‌ల్ కామ‌వాంఛ త‌ట్టుకోలేక ఆ బాలిక‌లు అల్లాడిపోయారు. ఎవ‌రికి కంప్లైంట్ చేసినా ఫ‌లితం ఉండ‌దేమోన‌ని నేరుగా సీఎంకే లెట‌ర్ రాయాల‌నుకున్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో  (uttar pradesh) చోటుచేసుకుంది. ఘ‌జియాబాద్‌కు చెందిన రాజీవ్ పాండే అనే వ్య‌క్తి ఓ స్కూల్‌కు ప్రిన్సిప‌ల్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇత‌ను ఆడ‌పిల్ల‌ల్ని త‌న క్యాబిన్‌కు ర‌మ్మ‌ని చెప్పి ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప‌ట్టుకోవ‌డం లాంటివి చేస్తుండేవాడు. దాంతో ఆ బాలిక‌లు ముందు వారి త‌ల్లిదండ్రుల‌కు విష‌యం చెప్పారు.

దాంతో వారు స్కూల్‌పై దాడి చేసి ప్రిన్స్‌ప‌ల్‌ను తిట్టి చావ‌బాదారు. దాంతో అత‌డు అక్ర‌మంగా త‌న స్కూల్‌లోకి ప్ర‌వేశించి కావాల‌నే త‌నపై నింద‌లు వేస్తున్నార‌ని ఆ త‌ల్లిదండ్రుల‌పై రాజీవ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఇరు వైపుల త‌ప్పు ఉంద‌ని పోలీసులు రాజీవ్‌పై.. బాలికల త‌ల్లిదండ్రుల‌పై కేసులు పెట్టారు. కానీ రాజీవ్‌ని కాసేప‌టికే వ‌దిలేసి త‌ల్లిదండ్రుల‌ను మాత్రం గంట పాటు స్టేష‌న్‌లో కూర్చోపెట్టార‌ట‌. దాంతో ఆ బాలిక‌లు ర‌క్తంతో సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు లెట‌ర్ రాసారు. విష‌యం మీడియాకు పొక్క‌డంతో వెంట‌నే రాజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (uttar pradesh)