మా వ‌క్షోజాల‌పై చేతులు వేసేవాడు.. టీచ‌ర్‌పై విద్యార్థినుల షాకింగ్ ఆరోప‌ణ‌లు

uttar pradesh mainpuri students reveal shocking details against a teacher

Uttar Pradesh: మా వ‌క్షోజాల‌పై చేతులు వేసే వాడు స‌ర్.. మా దుస్తుల్లో చేతులు పెట్టేవాడు.. అంటూ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మెయిన్‌పురి ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థులు ఓ టీచ‌ర్‌పై ఆరోప‌ణ‌లు చేయడం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. మెయిన్‌పురిలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న న‌రేంద్ర యాద‌వ్ అనే వ్య‌క్తి విద్యార్థినుల‌ను లైంగికంగా వేధించేవాడు.

ఆడ‌పిల్ల‌ల బాత్రూమ్‌లోకి తొంగి చూడ‌టం.. వెనక నుంచి వాటేసుకుని అస‌భ్య‌క‌ర‌మైన వీడియోలు చూపించడం వంటివి చేస్తున్నాడ‌ని పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి చెప్పారు. కానీ ఆమె ఏమీ చేయలేదు. ఆ త‌ర్వాత ఈ విష‌యాన్ని ప్రిన్సిప‌ల్ దృష్టికి తీసుకెళ్తే ఆమె కూడా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని విద్యార్థినులు తెలిపారు. పైగా ఈ విష‌యం బ‌య‌టికి చెప్తే ఎక్క‌డా చ‌దువుకోనివ్వ‌కుండా చేస్తానంటూ న‌రేంద్ర యాద‌వ్ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ మీడియా దృష్టికి తీసుకెళ్లారు. అలా ఈ విష‌యం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది.