Viral News: బ్యాంక్‌లో రూ.41.. హోట‌ల్ బిల్లు రూ.6 ల‌క్ష‌లు..ఏపీ మ‌హిళ టోక‌రా!

Viral News: ఓ మ‌హిళ ఫేక్ లావాదేవీలు చేస్తూ హోటల్‌లో ఏకంగా రూ.6 ల‌క్ష‌లు బిల్లు చేసి మోసానికి పాల్ప‌డింది. తీరా చూస్తే ఆమె బ్యాంక్ ఖాతాలో కేవ‌లం రూ.41 ఉండ‌టంతో హోట‌ల్ యాజ‌మాన్యం షాకైంది.

ఈ ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఝాన్సీ రాణి అనే మ‌హిళ ఢిల్లీలోని ఎరోసిటీ హోట‌ల్‌లో బ‌స చేసింది. ఫేక్ ఐడీ కార్డు చూపించి హోట‌ల్‌లోనే రూ.2 ల‌క్ష‌లు విలువైన స్పా ట్రీట్మెంట్ చేయించుకుంది. డ‌బ్బులు క‌ట్టేట‌ప్పుడు మాత్రం ICICI బ్యాంక్ నుంచి UPI ద్వారా చెల్లించిన‌ట్లు చూపించింది.

అప్ప‌టికే హోట‌ల్ వారు త‌మ బ్యాంక్ ఖాతాను చెక్ చేయ‌గా ఒక్క లావాదేవీ కూడా జ‌ర‌గ‌లేద‌ని తేలింది. దాదాపు 13 రోజుల పాటు హోట‌ల్‌లో ఉన్నాక ఝాన్సీ బండారం బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌ను పిలిపించారు. ఆమెను అదుపులోకి తీసుకుని బ్యాంక్ వివ‌రాలు చెక్ చేయ‌గా ఆమె ఖాతాలో కేవ‌లం రూ.41 ఉండ‌టం చూసి షాక‌య్యారు.