జువెల‌రీ షాపులో ఘోరం.. వాట‌ర్ బాటిళ్ల‌లో మూత్రం

urine found in water bottles in a jewellery shop

Viral News: జువెల‌రీ షాపులో మూత్రం పోసివున్న వాట‌ర్ బాటిళ్లు ల‌భ్యం కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ముంబైలోని వాసాయ్ ప్రాంతంలో ఉన్న ఓ ఇమిటేష‌న్ జువెల‌రీ షాపులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అక్క‌డ ప‌నిచేస్తున్న యువ‌తులు నీళ్లు తాగుదామ‌ని వాట‌ర్ బాటిల్స్ అడిగితే షాపు య‌జ‌మాని మూత్రం పోసి ఇచ్చాడ‌ట‌. దాంతో వారు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

కొంత‌కాలంగా య‌జ‌మాని త‌మ‌కు జీతాలు కూడా ఇవ్వ‌డం లేద‌ని.. వ్యాపారం న‌ష్టాల్లో ఉండ‌టంతో షాపు మూసేయాల‌నుకున్నార‌ని వారు పోలీసుల‌కు తెలిపారు. ఈ నేప‌థ్యంలో క‌నీసం త‌మ‌కు జీతాలు చెల్లించాల‌ని అడ‌గ‌డంతో ఆ కోపంతో మూత్రం పోసిన వాట‌ర్ బాటిళ్లు ఇచ్చాడ‌ని వెల్ల‌డించారు. అయితే పోలీసులు ఎలాంటి కేసు న‌మోదు చేయ‌కుండా షాపు య‌జ‌మానిని జీతాలు చెల్లించేయాల‌ని హెచ్చ‌రించారు.