Triple Murders: ఒక్క‌ రాత్రిలో మూడు మ‌ర్డ‌ర్లు..!

మ‌రోసారి దేశ రాజ‌ధాని దిల్లీ ఉలిక్కిప‌డింది. నిన్న రాత్రి వ‌రుస‌గా మూడు మ‌ర్డ‌ర్లు (triple murder) చోటుచేసుకున్నాయి.  ముగ్గురు యువ‌కులు క‌త్తులు ప‌ట్టుకుని వీరంగం సృష్టించారు. వీరిలో ఇద్ద‌రు ప‌ట్టుబ‌డ్డారు. మ‌రో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మొద‌టి ఘ‌ట‌న‌

మొద‌టి ఘ‌ట‌న‌లో షేరే మ‌హ‌మ్మ‌ద్ అనే 25 ఏళ్ల యువ‌కుడిపై మ‌రో యువ‌కుడు క‌త్తితో దాడి చేసాడు. అత‌ని క‌డుపులో బ‌లంగా పొడిచేసాడు. ర‌క్తం కారిపోతున్న‌ప్ప‌టికీ షేరే వేరే ఇంట్లోకి పారిపోయి దాక్కున్నాడు. అత‌న్ని వారు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. (triple murders)

రెండో ఘ‌ట‌న‌

గాంధీ న‌గ‌ర్‌కి చెందిన గుఫ్రాన్ అనే 35 ఏళ్ల వ్య‌క్తి టైల‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇత‌న్ని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు వెన‌క నుంచి పొడిచేసారు. దాంతో గుఫ్రాన్ అక్కడిక‌క్క‌డే చ‌నిపోయాడు. అత‌ని సెల్‌ఫోన్ లాక్కుని దుండ‌గులు పారిపోయారు.

మూడో ఘ‌ట‌న‌

ఇక మూడో ఘ‌ట‌నలో షారిక్ అనే యువ‌కుడిని మెడ‌పై క‌త్తితో పొడిచేసారు. అత‌ను ఎలాగోలా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డింది క‌పిల్, సొహైల్, స‌మీర్ అనే ముగ్గురు యువ‌కులు. వీరు నిన్న రాత్రి బాగా తాగి దొంగ‌తనాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రు ఒంట‌రిగా క‌నిపిస్తారో కాపలా కాసి మ‌రీ వారిపై దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఇందుకోసం బల్లిమార‌న్ ఏరియా నుంచి భారీ క‌త్తుల‌ను కొనుగోలు చేసారు. ఈ ముగ్గురూ పెద్ద రౌడీల‌ని స్థానికులు చెప్తున్నారు. వీరిలో ఇద్ద‌రు ప‌ట్టుబ‌డ్డారు. మ‌రో వ్య‌క్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. (triple murders)