Telangana: హొళీ పండగ రోజు విషాదం

Telangana: హొలీ పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. కొమురంభీం జిల్లా కౌటల మండలంలోని తాటిపెల్లి సమీపంలోని వార్దా నదిలో న‌లుగురు యువ‌కులు ఈతకు వెళ్లి గ‌ల్లంత‌య్యారు. వీరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు కౌటల మండలం నదిమాబాద్ గ్రామనికి చెందిన సంతోష్, ప్రవీణ్, కమలకర్, సాయిగా గుర్తించారు. చేతికి అందివ‌చ్చిన బిడ్డ‌లు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో వారి త‌ల్లిదండ్రుల ఆర్త‌నాదాలు మిన్నంటాయి.