Train Accident: శవం అనుకున్నారు.. కాలు ప‌ట్టేసుకున్నాడు!

Odisha: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న (train accident)గురించి రోజుకో విష‌యం బ‌య‌టికి వ‌స్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 300 మంది చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్ద‌రు బ‌తికే ఉన్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. రైలు ప్ర‌మాదంలో చ‌నిపోయాడ‌నుకుని శ‌వాల మ‌ధ్య ప‌డేసిన వ్య‌క్తి త‌న తండ్రికి ఫోన్ చేసి బ‌తికే ఉన్నాన‌ని వ‌చ్చి కాపాడాల‌ని చెప్పిన ఘ‌ట‌న వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. శ‌వాల కుప్ప మ‌ధ్య‌లో నిలబ‌డి ప‌రిశీలిస్తున్న ఓ వ్య‌క్తి కాలు ప‌ట్టుకున్నాడు ఓ బాధితుడు. దాంతో ఆ వ్య‌క్తి గుండె ఆగినంత‌ప‌నైంది. చ‌నిపోయాడ‌నుకున్న ఆ వ్య‌క్తిని 35 ఏళ్ల రాబిన్‌గా గుర్తించారు. నేను బ‌తికే ఉన్నాను, దాహంగా ఉంది అని అర‌వ‌డంతో వెంట‌నే అత‌న్ని ట్రీట్మెంట్‌కు త‌ర‌లించారు. స్పృహ‌కోల్పోయిన వారిని కూడా చ‌నిపోయార‌నుకుని శ‌వాల మ‌ధ్య‌లో ప‌డేయ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఓ వ్య‌క్తి స్పృహ‌లో లేక‌పోతే నాడి ప‌ట్టుకుని క‌నీసం ప‌రిశీలించ‌డంలేద‌ని, చ‌నిపోయార‌నుకుని శవాల‌లో క‌లిపేస్తున్నార‌ని అధికారులు మండిపడుతున్నారు.