Viral News: 200 కోట్లతో మోదీకి విగ్రహం

Viral News: రూ.200 కోట్లు పెట్టి ఓ వ్యాపారవేత్త భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి (narendra modi) విగ్ర‌హం క‌ట్టించ‌నున్నారు. అస్సాంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త నవీన్ చంద్ర బోరా ప్రధాని మోదీకి వీరాభిమాని. మోదీపై తన అభిమానాన్ని చాటుకునేందుకు సుమారు 200 కోట్లు వెచ్చించి.. తన సొంత స్థలంలో 190 అడుగుల ఎత్తైన మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం మూడు రోజుల పాటు భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు.