America: ప్రెసిడెంట్‌ని చంపాల‌ని తెలుగు యువ‌కుడి ప్లాన్

Washington: అమెరికా (america) అధ్య‌క్షుడు జో బైడెన్‌ని (joe biden) చంపేస్తానంటూ ఓ తెలుగు యువ‌కుడు ర‌చ్చ‌కు దిగాడు. సాయి వ‌ర్షిత్ కందుల (sai varshit kandula) అనే తెలుగు యువ‌కుడు అమెరికాలోని మిస్సోరిలో నివ‌సిస్తున్నాడు. భార‌త కాల‌మానం ప్ర‌కారం నిన్న రాత్రి అమెరికాలోని వైట్ హౌస్ ముంద‌ర u-haul ట్ర‌క్కుతో దాడి చేసేందుకు య‌త్నించాడు. దాంతో పోలీసులు వెంట‌నే అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరిక‌న్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సాయి వర్షిత్ సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్ట‌న్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాడు. అక్క‌డ u-haul సంస్థ‌కు చెందిన ఓ ట్ర‌క్కు తీసుకుని వైట్ హౌస్ బ్యారికేడ్ల‌ను ఢీకొట్టాడు. దాంతో సైర‌న్ మోగ‌డంతో పోలీసులు వెంట‌నే హ‌ర్షిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ చేప‌ట్ట‌గా.. ఎప్ప‌టినుంచో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ను చంపాల‌నుకుంటున్న‌ట్లు తెలిపాడు.

ఇందుకోసం 6 నెలల నుంచి ప్లాన్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ఎందుకు చంపాల‌నుకుంటున్నావ్ అని అడిగితే. వైట్ హౌస్‌లోకి వెళ్లి అధికారం సొంతం చేసుకోవాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పాడు. దాంతో అమెరిక‌న్ పోలీసులు షాక‌య్యారు. సాయి వ‌ర్షిత్ వ‌ద్ద నాజీ జెండాను కూడా అమెరికా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిట్ల‌ర్ గొప్ప‌త‌నం గురించి వివ‌రిస్తుంటే అత‌ను మెంట‌ల్‌గా డిస్ట‌ర్బ్ అయివున్నాడ‌ని పోలీసుల‌కు అర్థ‌మైంది. వెంట‌నే అత‌న్ని ఓ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అతని గురించి తెలుసుకునేందుకు మిస్సోరిలోని వాళ్లింటికి పోలీసులు వెళ్లారు. అతడికి మంచచి కోడింగ్ స్కిల్స్ ఉన్నాయ‌ని, డేటా సైంటిస్ట్‌గా ప‌నిచేస్తున్నాడ‌ని తెలిసింది. అయితే అత‌నిపై ఎలాంటి క్రిమిన‌ల్ రికార్డులు లేక‌పోవ‌డంతో పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోలేదు.