అమెరికాలో గుండెపోటుతో తెలుగు యువ‌కుడు మృతి

జ‌న‌గామ జిల్లాకు చెందిన ఓ తెలుగు యువ‌కుడు అమెరికాలో గుండెపోటుతో (Heart Attack) మృతిచెందాడు. బ‌చ్చ‌న్న‌పేట మండ‌లానికి చెందిన చిట్టోజు మ‌హేష్ అనే వ్య‌క్తి అమెరికాలోని జార్జియాలో గుండెపోటుకు గుర‌య్యాడు. ఆఫీస్ ప‌నిలో ఉండ‌గానే అత‌నికి గుండెపోటు రావ‌డంతో అక్క‌డిక్క‌డే మృతిచెందాడు. మ‌హేష్ మూడేళ్ల నుంచి త‌న భార్య‌తో క‌లిసి జార్జియాలో ఉంటున్నాడు. వీరికి నాలుగేళ్ల బిడ్డ కూడా ఉంది. మ‌హేష్ మృత‌దేహాన్ని భార‌త్‌కు త‌ర‌లించేందుకు అత‌ని భార్య గో ఫండ్ మీ పేజీ ద్వారా విరాళాలు సేక‌రిస్తోంది.