అమెరికాలో మరోసారి కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

telugu guy died in usa shootings

అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఆర్కెన్సాస్‌లోని సూపర్ మార్కెట్లో కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో తెలుగు యువకుడైన‌ దాసరి గోపీకృష్ణ తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు గోపీకృష్ణ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన వాడిగా అక్క‌డి పోలీసులు గుర్తించారు. గోపీకృష్ణ మృతదేహాన్ని భార‌త్‌కు త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.