Telangana: ప‌రీక్ష‌కు రానివ్వ‌ని అధికారులు.. విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

Telangana: తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌ర ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆదిలాబాద్‌కు చెందిన టేకుం శివ‌కుమార్ అనే విద్యార్ధి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. ప‌రీక్ష‌కు ఒక్క నిమిషం ఆలస్యం అయినా అధికారులు రానివ్వ‌క‌పోవ‌డంతో శివ‌కుమార్ ఈ ఒక్క‌సారికి రానివ్వాల‌ని ప్రాథేయ‌ప‌డ్డాడు. అయినా వారు ఒప్పుకోక‌పోవ‌డంతో క్ష‌మించు నాన్నా.. అని లేఖ రాసి మ‌రీ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దాంతో శివ‌కుమార్ తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు.