ఏపీలో 4 లిక్క‌ర్ షాప్ లైసెన్సులు ద‌క్కించుకున్న తెలంగాణ వ్యాపారి

telangana man owns 4 liquor shops in ap

Liquor: తెలంగాణ‌కు చెందిన ఓ వ్యాపార‌వేత్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏకంగా నాలుగు మ‌ద్యం షాపుల లైసెన్స్‌లు ద‌క్కించుకున్నారు. ఖ‌మ్మంకి చెందిన కొండ‌ప‌ల్లి గ‌ణేష్ అనే వ్యాపార‌వేత్త‌.. ఇటీవ‌ల మై హోం భూజ‌లో జ‌రిగిన ల‌డ్డూ వేలం పాట‌లో రూ.27 ల‌క్ష‌ల‌కు ల‌డ్డూను ద‌క్కించుకున్నారు. ఇప్పుడు అదే వ్య‌క్తి ఏపీలో నాలుగు మ‌ద్యం దుకాణాల‌కు లైసెన్స్‌లు గెలుచుకోవ‌డం వైర‌ల్‌గా మారింది. ల‌క్కీ డ్రాలో ఒక‌టి పుట్ట‌ప‌ర్తిలో మ‌రో మూడు నంద్యాల‌లో మ‌ద్యం షాపుల లైసెన్స్‌లు ద‌క్కించుకున్నాడు. ఏపీలో 3,396 లిక్క‌ర్ షాప్‌ల‌కు గానూ 90 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. వీటిలో 40 శాతం మ‌హిళ‌లు ఉండ‌గా వారిలో ప‌ది శాతం మందికి లిక్క‌ర్ షాపులు న‌డుపుకునేందుకు లైసెన్స్‌లు ల‌భించాయి.