అమెరికాలో తెలంగాణ వాసి మృతి

telangana man dies in usa

Telangana: అమెరికాలో తెలంగాణ వాసి మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి అమెరికాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం ప్రవీణ్ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. అతడి మృత‌దేహాన్ని స్వగ్రామానికి త్వరగా తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించి ఆదుకోవాలని ప్రవీణ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.