YCPకి ఓటేసిన త‌ల్లి.. హత్య చేసిన TDP కార్యకర్త

tdp activist kills his mother as she voted for ysrcp

AP Elections: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లిలో ఓ మ‌హిళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిందన్న కారణంతో ఆమె కొడుకు మద్యం మత్తులో దారుణ హత్య చేసి పరారయ్యాడు.

వడ్డే వెంకటేశులు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ప్రచార కార్యక్ర‌మాల్లో తిరిగేవాడు. ఈ నేప‌థ్యంలో వడ్డే సుంకమ్మ(45) వైఎస్సార్సీపీకి ఓటు వేసినట్లు కొడుకుతో చెప్పగా కోపంతో ఊగిపై మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవకి దిగాడు. క్షణికావేశంలో కన్న తల్లి తలపై ఇనుప సుత్తితో బాది హత్య చేశాడు. సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.