T20 సెల‌బ్రేష‌న్స్.. ఐదేళ్ల చిన్నారి దుర్మ‌ర‌ణం

t20 celebrations kills a 5 year old

Viral News: టీ20 వ‌ర‌ల్డ్ కప్ భార‌త్‌ను వ‌రించిన నేప‌థ్యంలో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. కానీ అవే సంబ‌రాల కార‌ణంగా ఓ ప‌సిమొగ్గ ప్రాణం పోయింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక బ‌ధ‌య్యా మొహ‌ల్లా ప్రాంతంలో కొంద‌రు పిల్ల‌లు టీమిండియా గెలిచిన ఆనందంలో ట‌పాసులు పేల్చారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు పిల్ల‌లు ఓ గాజు సీసాలో రాకెట్ పెట్టి వెలిగించారు. ఆ రాకెట్ అక్క‌డే ఉన్న ఐదేళ్ల బాలుడికి త‌గిలి వెళ్ల‌డంతో బాలుడు నిమిషాల్లోనే చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ గాజు ముక్క ప‌గిలి బాలుడి క‌డుపులో గుచ్చుకోవ‌డంతో బాలుడు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. దాంతో బాలుడి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌య్యారు.