Ayodhya: అయోధ్య‌లో అనుమానిత ఉగ్ర‌వాదులు!?

Ayodhya: ఈనెల 22న అయోధ్య రామ‌మందిరంలో రాముల‌వారి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో యావ‌త్ ఉత్తర్ ప్ర‌దేశ్‌లో ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు క్షేత్ర‌స్థాయిలో నిఘా ఉంచాయి. ఈ నేప‌థ్యంలో అయోధ్య‌లో సాధార‌ణ వ్య‌క్తుల ముసుగులో అనుమానిత ఉగ్ర‌వాదులు తిరుగుతున్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం. కొంద‌రు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేప‌డుతున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న‌వారిని విచార‌ణ చేప‌ట్టగా వారికి ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో ఎలాంటి సంబంధాలు లేవ‌ని తేలింది.