Tirumala Issue: CBI డైరెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో SIT విచార‌ణ‌

supreme court ordered for sit investigation under cbi investigation

Tirumala Issue: తిరుమ‌ల ల‌డ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. CBI డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సూద్ ఆధ్వ‌ర్యంలో స్వ‌తంత్రంగా SIT విచార‌ణ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ విచార‌ణ‌లో ఐదుగురు అధికారులు ఉంటారు. ఇద్ద‌రు CBI నుంచి ఇద్ద‌రు రాష్ట్ర SIT టీం నుంచి ఒక‌రు FSSAI నుంచి ఈ విచార‌ణ‌లో పాల్గొంటారు. రాజ‌కీయ గొడ‌వ‌ల కోసం కోర్టుల‌ను ఉప‌యోగించుకోకూడ‌ద‌ని కూడా ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జ‌స్టిస్ గ‌వాయ్ వెల్ల‌డించారు.