Prakash Raj: ఘోర అవ‌మానం..!

Bengaluru: న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌కి (prakash raj) ఘోర అవ‌మానం చోటుచేసుకుంది. క‌ర్ణాట‌క‌లోని శిమోగాలో ఉన్న ఎంవీ కాలేజ్‌కి (mv college) ప్ర‌కాష్ రాజ్ వెళ్లారు. నిన్న కాలేజ్‌లో జ‌రిగిన ఈవెంట్‌కి ప్ర‌కాష్ రాజ్‌ని గెస్ట్‌గా ఇన్‌వైట్ చేసారు. ఆయ‌న సినిమా, థియేట‌ర్, సొసైటీ గురించి మాట్లాడారు. అయితే ఆయ‌న స్పీచ్‌పై కొంద‌రు కాలేజ్ స్టూడెంట్స్ నిర‌స‌న వ్య‌క్తం చేసారు. ఈవెంట్ అయిపోగానే ప్ర‌కాష్ రాజ్ వెళ్లాక‌.. ఆయ‌న న‌డిచిన ప్ర‌దేశాన్ని, కూర్చున్న ప్ర‌దేశాన్ని స్టూడెంట్స్ ఆవు మూత్రంతో శుభ్రం చేసారు. ప్రైవేట్ ఈవెంట్‌ను కాలేజ్‌లో ఎలా నిర్వ‌హిస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.