Kolkata Rape Case: క‌ల‌క‌త్తా రేప్ కేసులో షాకింగ్ ట్విస్ట్

shocking details revealed on kolkata medical college ex principal

Kolkata Rape Case: దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన క‌ల‌క‌త్తా రేప్ కేసులో షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆర్జీ క‌ర్ మెడిక‌ల్ కాలేజ్ మాజీ ప్రిన్సిప‌ల్ సందీప్ ఘోష్‌ను CBI విచార‌ణ చేప‌ట్ట‌గా.. అత‌ను అనాథ శ‌వాల‌ను అమ్ముకున్న‌ట్లు బ‌య‌టప‌డింది. ఈ విష‌యాన్ని ఆర్జీ క‌ర్ మెడిక‌ల్ కాలేజ్ మాజీ డిప్యూటీ సూప‌రింటెండెంట్ అఖ్త‌ర్ అలీ వెల్ల‌డించారు. ఈ విష‌యంలో సందీప్‌పై ఓ కేసు కూడా నమోదైంద‌ని.. అనాథ శ‌వాల‌తో పాటు బ‌యోమెడిక‌ల్ వేస్ట్‌ని కూడా అమ్ముకునేవాడ‌ని తెలిపారు. వీటిని బంగ్లాదేశ్‌కు అమ్మేసి డ‌బ్బులు తీసుకునేవాడ‌ని ఆరోపించారు.

విచార‌ణ‌లో సందీప్ అక్ర‌మాలు బ‌య‌టప‌డినా అత‌న్ని ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేద‌ని అఖ్త‌ర్ అలీ అన్నారు. పైగా ఈ విష‌యాల‌ను తాను బ‌య‌ట‌పెట్టినందుకు త‌న‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసార‌ని విద్యార్థుల‌ను ఆ రాక్ష‌సుడి నుంచి ఎంత కాపాడాల‌ని ప్ర‌య‌త్నించినా త‌న వ‌ల్ల కాలేద‌ని అన్నారు. సందీప్ ఘోష్ విద్యార్థుల‌ను పాస్ చేయించ‌డానికి డ‌బ్బులు తీసుకునేవార‌ని షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార కేసులో సీబీఐ సందీప్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచార‌ణ చేప‌డుతోంది.