Badlapur Sex Abuse: బాలిక‌ల యోనిలు ఛిద్రం.. బద్లాపూర్ కేసులో సంచ‌ల‌నాలు

shocking details emerged from Badlapur Sex Abuse case

Badlapur Sex Abuse:  ఓ ప‌క్క క‌లక‌త్తా అత్యాచార ఘ‌ట‌న‌లో విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలోనే మ‌హారాష్ట్ర‌లోని బ‌ద్లాపూర్‌లో ఇద్దరు మైన‌ర్ల‌పై జ‌రిగిన లైంగిక వేధింపుల విష‌యంలో సంచ‌ల‌నాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. బ‌ద్లాపూర్‌లోని ఓ కిండ‌ర్‌గార్టోన్ స్కూల్‌లో వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి 3, 4 ఏళ్ల బాలిక‌ల‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. దాదాపు 15 రోజులుగా వారిపై లైంగికంగా దాడికి పాల్ప‌డ్డాడ‌ని.. దాంతో పిల్ల‌ల యోనులు ఛిద్రం అయిపోయి ఉన్నాయ‌ని వైద్య రిపోర్ట్‌లో వెల్ల‌డైంది.

ఈ విష‌యం గురించి పిల్ల‌ల త‌ల్లిదండ్రులు స్కూల్ యాజ‌మాన్యానికి చెప్పినా వారు వెంట‌నే యాక్ష‌న్ తీసుకోలేద‌ని.. ధ‌ర్నాలు చేసాక అప్పుడు కానీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేద‌ని తేలింది. నిందితుడు అక్ష‌య్ శిందేను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేష‌న్ లేకుండా ఉద్యోగంలో పెట్టుకున్నార‌ని ఫీమేల్ టాయ్‌లెట్స్‌లోకి కూడా అత‌నికి యాక్సెస్ ఉంద‌ని వెల్ల‌డైంది. మ‌రోప‌క్క కేసును విచార‌ణ చేస్తున్న ఓ పోలీస్ అధికారి బాలిక‌ల త‌ల్లిదండ్రుల‌ను అడిగిన విచిత్ర ప్ర‌శ్న‌పై వివాదం నెలకొంది. ఆ పిల్ల‌లు ఇద్ద‌రూ ఎక్కువగా సైకిల్ తొక్కేవారా? అందుకే వారి యోని భాగాలు ఛిద్ర‌మై ఉన్నాయా అని అడిగాడ‌ట‌. దాంతో బాలిక త‌ల్లిదండ్రులు ఆ అధికారిపై దాడికి దిగ‌బోయారు.