Crime News: వార్డెన్ అక్ర‌మ సంబంధం.. విద్యార్ధినులను బ‌లి తీసుకుంది

Crime News: ఎంత ఘోరం..! అభం శుభం తెలీని విద్యార్ధుల ఆల‌నా పాల‌నా చూసుకోవాల్సిందిపోయి.. త‌న అక్ర‌మ సంబంధానికి అడ్డువ‌స్తున్నార‌ని వారిని బ‌లి తీసుకుంది ఓ వార్డెన్. ఈ దారుణ ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరిలో చోటుచేసుకుంది. ఇటీవ‌ల భువ‌న‌గిరిలో భ‌వ్య‌, వైష్ణ‌వి అనే ఇద్ద‌రు టెన్త్ విద్యార్ధినులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏం జ‌రిగిందా అని పోలీసులు ఆరా తీయ‌గా భ‌వ్య‌, వైష్ణ‌విలు క‌లిసి ఇత‌ర విద్యార్ధుల‌ను ఏడిపిస్తున్నార‌ని అందుకే వార్డెన్‌కు ఫిర్యాదు చేసార‌ని వార్డెన్ వారిని తిట్ట‌డంతో వారు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని క‌థ అల్లారు.

మేడం చాలా మంచిది అని రాయించి..!

పోలీసుల‌కు విద్యార్ధినుల నుంచి ఓ లేఖ దొరికింది. అందులో “” ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు క్ష‌మించండి. మా త‌ప్పు లేక‌పోయినా మ‌మ్మ‌ల్ని నిందిస్తుంటే త‌ట్టుకోలేక‌పోయాం. వార్డెన్ మేడం చాలా మంచిది. ఆమెను ఏమీ అన‌డానికి వీల్లేదు. మా బాధ‌ను ఆమె అర్థంచేసుకున్న‌ట్లు మా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేదు. మాది చివ‌రి కోరిక తీర్చండి. మేం చ‌నిపోయాక మా స‌మాధులు ఒకే ద‌గ్గ‌ర పెట్టండి “” అని రాసుంది.

ఆ లెట‌రే ప‌ట్టించిందా?

అయితే పిల్ల‌లు లేఖ‌లో వార్డెన్ మేడ‌మ్‌ను ఏమీ అనొద్దు అని అంత బాగా నొక్కి రాసారంటే అనుమానం వార్డెన్‌పైకే వెళ్లింది. ఆరా తీస్తే ఆమెకు మ‌రొక‌రితో అక్ర‌మ సంబంధం ఉంద‌ని.. వారిద్ద‌రూ స‌న్నిహితంగా ఉన్న‌ప్పుడు పిల్ల‌లు చూడ‌టంతో వారిని చంపేసిన‌ట్లు ఉంద‌ని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. త‌మ పిల్ల‌ల‌ది ముమ్మాటికీ హత్యే అని ధ‌ర్నా చేప‌డుతున్నారు.