Nandyal: 3వ తరగతి చదువుతున్న బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు

sensational details revealed by police in nandyal rape case

Nandyal: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక‌పై జ‌రిగిన గ్యాంగ్ రేప్ కేసులో భాగంగా పోలీసులు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురే. సెల్ ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గొంతు నులిమి చంపిన వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో వారు తల్లిదండ్రుల‌కు చెప్పారు. త‌మ పిల్ల‌ల్ని ర‌క్షించుకునేందుకు త‌ల్లిదండ్రులు ఆ మృతదేహాన్ని రాయి కట్టి కృష్ణానదిలో ప‌డేసారు.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు బాలిక మృత‌దేహం దొర‌క్క‌పోవ‌డంతో మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకుని ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ఆదిరాజు సింగ్ రానా తెలిపారు. మైనర్ బాలిక పార్కు దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలురు ఆ అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అమ్మాయిని అత్యాచారం చేసి గొంతు నులిమి చంపిన‌ట్లు తెలిపారు.

వారికి ఏం చేయాలో అర్థం కాక కొంత దూరం సైకిల్ ద్వారా ఇంకొంత దూరం మోటర్ వాహనంతో అమ్మయిని తీసుకువెళ్లారని, ఆ ముగ్గురు పిల్లలలో ఒక బాలుడి తండ్రి, మరో బాలుడి పెదనాన్న వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడేసినట్లు పోలీసులకు ఆ ముగ్గురు బాలురు తెలిపారు. వారి సమాచారం మేరకు SDRF, NDRF, బృందాలతో సెర్చింగ్ నిర్వహించామని బాలిక‌ డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు.